రాజ్యాంగ పరిణామ క్రమం - 2

1. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

Answer: 1937, ఏప్రిల్‌ 1

 

2. దిల్లీలో ఏర్పాటు చేసిన ‘ఫెడరల్‌ న్యాయ స్థానానికి’ మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వ్యవహరించారు?

Answer:  సర్‌ మారిస్‌ గ్వేయర్‌

 

3. ‘మంచి వాహనానికి చక్కటి బ్రేకులు అమర్చి, ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మరచిపోయారు’’ అని భారత ప్రభుత్వ చట్టం, 1935పై వ్యాఖ్యానించింది ఎవరు?

Answer: Nehru

 

4. ఏ చట్టం ద్వారా ‘కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’ను ‘ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’గా మార్చారు?

Answer: మింటో-మార్లే సంస్కరణల చట్టం, 1909

 

5. ‘‘మింటో-మార్లే సంస్కరణల చట్టం (1909) హిందువులు, ముస్లింల మధ్య వేర్పాటువాదానికి బీజాలు నాటి, భారతదేశ విభజనకు కారణమైంది’’ అని పేర్కొంది ఎవరు?

Answer: జవహర్‌లాల్‌ నెహ్రూ

 

6. 1921లో కేంద్ర శాసనసభలోని ‘లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’కి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు?

Answer:  సచ్చిదానంద సిన్హా, సర్‌ ఫ్రెడరిక్‌ వైట్‌

 

7. మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ప్రకారం ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ ఏర్పాటు గురించి అధ్యయనం చేసేందుకు నియమించిన కమిషన్‌?

Answer: లీ కమిషన్‌

 

8. సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వేబడ్జెట్‌ను ఏ చట్టం ద్వారా వేరు చేశారు?

Answer: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919

 

9. ‘‘భారతదేశంలో ద్వంద్వ అనేది దాదాపు దూషించే మాట అయ్యింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నీవు డైయార్కివి అని అరవడం నేను విన్నాను’’ అని ఎవరు పేర్కొన్నారు?

Answer: సర్‌ బట్లర్‌

 

10. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919ని ‘‘సూర్యుడు లేని ఉదయం’’గా పేర్కొంది?

Answer: బాలగంగాధర్‌ తిలక్‌