భారత రాజ్యాంగ రచన - స్వభావం - 2

1. త్వరలోనే రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికైన శాసన సభ్యులు రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకుంటారని 1945, సెప్టెంబరు 19న దిల్లీలోని ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రకటించినవారు?

Answer: లార్డ్‌ వేవెల్‌

 

2.  బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌ను భారతదేశానికి ఎప్పుడు పంపారు?

Answer:  1946, మార్చి 24   

 

3. హైదరాబాద్‌ సంస్థానం నుంచి 15 మంది ప్రతినిధులను రాజ్యాంగ సభకు ఎప్పుడు నామినేట్‌ చేశారు? 

Answer: 1948 నవంబరు   

 

4. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డ్‌కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరించారు?

Answer: దుర్గాబాయి దేశ్‌ముఖ్‌  

 

5. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు ‘హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ గ్రంథాన్ని రాశారు?

Answer: భోగరాజు పట్టాభి సీతారామయ్య

 

6. 1947, ఆగస్టు 29న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా  కమిటీలో సభ్యులు కానివారు? 

Answer:  కె.టి.షా, హెచ్‌.సి.ముఖర్జీ

 

7. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ ‘ముసాయిదా రాజ్యాంగాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది? 

Answer: 1948, నవంబరు 4 

 

8. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ను ఆధునిక మనువుగా, రాజ్యాంగ పితామహుడిగా ‘ది కాన్‌స్టిట్యూషనల్‌ గవర్నమెంట్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

Answer: ఎం.వి.పైలీ 

 

9. రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?

Answer:  1946 డిసెంబరు 9 నుంచి 23 వరకు

 

10. జవహర్‌లాల్‌ నెహ్రూ ‘ఉద్దేశాల తీర్మానం/చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

Answer:  1946, డిసెంబరు 13